విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు – ఎస్సీ మోర్చా కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన నితిన్ నబిన్
విశాఖపట్నంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు – ఎస్సీ మోర్చా కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్ను పరిశీలించిన నితిన్ నబిన్, సంతోష్ బి.ఎల్.
విశాఖపట్నం: విశాఖపట్నంలో నిర్వహించిన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరైన బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారిని బీజేపీ ఎస్సీ మోర్చా – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పానతల సురేష్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
![]() |
| బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ గారితో పానతల సురేష్ గారు |
ఈ సందర్భంగా బీజేపీ ఎస్సీ మోర్చా – ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన వివిధ కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్ను బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నితిన్ నబిన్ గారు, జాతీయ సంఘటన ప్రధాన కార్యదర్శి శ్రీ సంతోష్ బి.ఎల్. జీ పరిశీలించారు.
![]() |
| బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ గారితో పానతల సురేష్ గారు |
ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సామాజిక, సేవా, ప్రజా చైతన్య కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను వారు ఆసక్తిగా పరిశీలించారు. కార్యక్రమాల వివరాలను శ్రీ పానతల సురేష్ గారు వారికి వివరించారు.
![]() |
| నితిన్ నబిన్, సంతోష్ బి.ఎల్. గారితో పానతల సురేష్ గారు |
ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను నాయకులు అభినందించడం కార్యకర్తలకు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని అందించింది. భవిష్యత్తులో మరింత విస్తృతంగా ప్రజా సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు.
ఎస్సీ మోర్చాలో వారు ప్రతీ జిల్లాలో అంబేడ్కర్ గారికి సంబంధించి చాలా పెద్ద కార్యక్రమాలు నిర్వహించారు.






Comments
Post a Comment